అదృష్టవంతులు (1969)
జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వీ మధుసూదనరావు చిత్రానువాదం చేసి దర్శకత్వం వహించారు. ఆచార్య ఆత్రేయ మాటలు రాశారు.
జైలు నుంచి విడుదలైన రఘు (నాగేశ్వరరావు) బ్రతుకు తెరువు కోసం ప్రయత్నించి లారీ డ్రైవర్ గా మారతాడు. అతనికి ఉద్యోగం దొరకడానికి సహకరించిన జాకీ (పద్మనాభం) క్లీనర్ గా జత అవుతాడు. ఊటీకి లోడ్ తో వెళ్తున్న వారికి మగవేషం వేసుకని తిరుగుతున్న జయ (జయలలిత) తారసపడుతుంది. జయ ఇంటి నుంచి పారిపోయి వచ్చినదని తెలుసుకున్న రఘు ఆమెను ఇంటి దగ్గర దించే ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఆమె మేనమామ రాజు (ప్రభాకర రెడ్డి)ని చూసి, అతడు దుర్మార్గుడని అంతకు ముందే తెలిసిన రఘు తన ప్రయత్నాని విరమించుకొని జయను తనతో ఇంటికి తీసుకువస్తాడు. తన గతాన్ని చెబుతాడు. బాల్యంలో తల్లి మందులు కోసం దొంగగా మారతాడు రఘు. పోలీసులు కొడుకుని అరెస్ట్ చేయడానికి వస్తే, చూసి తట్టుకోకలేని తల్లి మరణిస్తుంది. పోలీసుల నుంచి అతడిని ఒక దొంగ తప్పించి ముఠాలో చేరుస్తాడు ఆ దౌంగల ముఠా నాయకుని (జగ్గయ్య) కి రఘు అంటే గురి. ఒక సారి తల్లి దగ్గర నుంచి నుండి కొడుకును వేరు చేయవలసి వస్తుంది. అది చేయలేక జైలు కెళ్ళి దారి మార్చుకుంటాడు. కాని జైల్ సూపరింటెండెంట్ (గుమ్మడి) అతని పరివర్తనను నమ్మడు. రఘు కథ విని జయ అతడిని నమ్మి ఇష్టపడుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. వాళ్లకి కూతురు పుడుతుంది. మరోవైపు దొంగల ముఠా రఘును పాతదారిలోకి తీసుకురాడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో రఘు లారీని తగల బెడతారు బ్రతుకు తెరువు కోల్పోయిన రఘుకు అన్ని మార్గాలు మూసుకుపోతాయి. కుటుంబాన్ని పోషించడానికి జయ క్లబ్ లో డాన్స్ చేస్తుండగా రఘును తీసుకు వెళ్లి చూపుతాడు దొంగల నాయకుడు. రఘు తన పరిస్ధిత వివరించి జైల్ సూపరింటెండెంట్ ని కలిసి తన నిజాయితిని తెలిపి, పోలీస్ ఇన్ఫార్మర్ గా దొంగల ముఠాలో చేరి వారిని పోలీసులకు అప్పగిస్తాడు.
అదృష్టవంతులు (1969)
జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వీ మధుసూదనరావు చిత్రానువాదం చేసి దర్శకత్వం వహించారు. ఆచార్య ఆత్రేయ మాటలు రాశారు.
జైలు నుంచి విడుదలైన రఘు (నాగేశ్వరరావు) బ్రతుకు తెరువు కోసం ప్రయత్నించి లారీ డ్రైవర్ గా మారతాడు. అతనికి ఉద్యోగం దొరకడానికి సహకరించిన జాకీ (పద్మనాభం) క్లీనర్ గా జత అవుతాడు. ఊటీకి లోడ్ తో వెళ్తున్న వారికి మగవేషం వేసుకని తిరుగుతున్న జయ (జయలలిత) తారసపడుతుంది. జయ ఇంటి నుంచి పారిపోయి వచ్చినదని తెలుసుకున్న రఘు ఆమెను ఇంటి దగ్గర దించే ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఆమె మేనమామ రాజు (ప్రభాకర రెడ్డి)ని చూసి, అతడు దుర్మార్గుడని అంతకు ముందే తెలిసిన రఘు తన ప్రయత్నాని విరమించుకొని జయను తనతో ఇంటికి తీసుకువస్తాడు. తన గతాన్ని చెబుతాడు. బాల్యంలో తల్లి మందులు కోసం దొంగగా మారతాడు రఘు. పోలీసులు కొడుకుని అరెస్ట్ చేయడానికి వస్తే, చూసి తట్టుకోకలేని తల్లి మరణిస్తుంది. పోలీసుల నుంచి అతడిని ఒక దొంగ తప్పించి ముఠాలో చేరుస్తాడు ఆ దౌంగల ముఠా నాయకుని (జగ్గయ్య) కి రఘు అంటే గురి. ఒక సారి తల్లి దగ్గర నుంచి నుండి కొడుకును వేరు చేయవలసి వస్తుంది. అది చేయలేక జైలు కెళ్ళి దారి మార్చుకుంటాడు. కాని జైల్ సూపరింటెండెంట్ (గుమ్మడి) అతని పరివర్తనను నమ్మడు. రఘు కథ విని జయ అతడిని నమ్మి ఇష్టపడుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. వాళ్లకి కూతురు పుడుతుంది. మరోవైపు దొంగల ముఠా రఘును పాతదారిలోకి తీసుకురాడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో రఘు లారీని తగల బెడతారు బ్రతుకు తెరువు కోల్పోయిన రఘుకు అన్ని మార్గాలు మూసుకుపోతాయి. కుటుంబాన్ని పోషించడానికి జయ క్లబ్ లో డాన్స్ చేస్తుండగా రఘును తీసుకు వెళ్లి చూపుతాడు దొంగల నాయకుడు. రఘు తన పరిస్ధిత వివరించి జైల్ సూపరింటెండెంట్ ని కలిసి తన నిజాయితిని తెలిపి, పోలీస్ ఇన్ఫార్మర్ గా దొంగల ముఠాలో చేరి వారిని పోలీసులకు అప్పగిస్తాడు.
కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో పాటలన్నీ బాగుంటాయి. ముఖ్యంగా అయ్యయ్యో బ్రహ్మయ్య (సినారె), చింత చెట్టు చిగురు చూడు(ఆరుద్ర), కోడి కూసే జాము దాకా (ఆత్రేయ), ముద్దంటే చేదా ఆరుద్ర), నమ్మరే నేను మారానంటే నమ్మరే(ఆత్రేయ) , మొక్కజొన్న తోటలో ( కొనకళ్ళ వెంకటరత్నం) - పాటలు ఇప్పటికీ వింటుంటాం. చిత్రం లో అన్ని పాటలూ పద్మనాభం డ్యూయెట్ ( నామనసే గోదారి) సహా ఘంటసాల, సుశీల పాడారు.
ఈ సినిమాను తమిళంలో తిరుడన్, హిందీలో హిమ్మత్, శ్రీలంకలో సింహళ భాషలో ఎదత్ సూర్య అదత్ సూర్య అనే పేర్లతో నిర్మించారు.*
No comments:
Post a Comment