ముఖేష్ చంద్ మాథుర్ భారతీయ హిందీ సినిమా పరిశ్రమలో ఒక స్వర్ణ యుగాన్ని ఏలిన సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు. మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్లతో పాటు ముఖేష్ను అత్యంత ముఖ్యమైన ముగ్గురు గాయకులలో ఒకరిగా పరిగణిస్తారు.
ముఖేష్ 1923 జూలై 22న ఢిల్లీలో జన్మించారు. ఆయన స్వరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన వేదన, ఆర్ద్రత శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవి. ముఖ్యంగా వియోగం, తత్వచింతనతో కూడిన పాటలకు ముఖేష్ స్వరం బ్రాండ్ అంబాసిడర్గా నిలిచింది.
ప్రముఖ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ తెరపైకి వస్తే, ఆయనకు స్వరం ముఖేష్దే అయి ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ బాలీవుడ్లో ఒక చరిత్ర సృష్టించింది. రాజ్ కపూర్ స్వయంగా ముఖేష్ను తన స్వరం,ఆత్మ గా అభివర్ణించేవారు.
ముఖేష్ పాటల్లో ఆవారా హూ (ఆవారా), జీనా యహా - మర్నా యహా (మేరా నామ్ జోకర్), మేరా జూతా హై జపానీ (శ్రీ 420),కభీ కభీ మేరే దిల్ మే (కభీ కభీ), ఏక్ దిన్ బిక్ జాయేగా మాటీ కే మోల్ (ధరమ్ కరమ్),సుహానా సఫర్ అవర్ యే మౌసమ్ హసీన్ (మధుమతి) బహుళ ప్రజాదరణ పొందాయి.
1974లో వచ్చిన రజనీగంధ సినిమాలోని "కయీ బార్ యుహీ దేఖా హై" అనే పాటకుగానూ ఉత్తమ నేపథ్య గాయకుడిగా ముఖేష్ జాతీయ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా 4 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు.
1976 ఆగస్టు 27న అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో ఒక సంగీత విభావరి కోసం వెళ్లినప్పుడు గుండెపోటుతో కన్నుమూశారు.
No comments:
Post a Comment