హైదరాబాద్: హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తప్పించాలని హైకోర్టు ఆదేశించింది. సెక్రటరీ స్థాయి అధికారితో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. లోతుకుంట భూముల వ్యవహారంలో ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోతుకుంటలోని సర్వే నెంబర్ 1, 2 లలో ఉన్న 40 ఎకరాల భూములు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ స్వాధీనంలో ఉన్నాయి. ఈ భూముల్లో హైడ్రా జోక్యం చేసుకొని ఫెన్సింగ్ వేసిందని, కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ లెక్కచేయకుండా హైడ్రా వ్యవహరిస్తోందని శాంతాశ్రీరామ్ కంపెనీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకే చెందుతుందని కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారని కోర్టుకు తెలిపింది. కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఉత్తర్వులు వెలువరించిన హైకోర్టు కమిషనర్ రంగనాథ్ను ఆ పదవి నుంచి తొలగించాలని ఆదేశించింది.
Subscribe to:
Post Comments (Atom)
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...
-
ముంబై:ప్రముఖ నటుడు ప్రదీప్సింగ్ రావత్ (74) ముంబయిలోని నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆయన నటించారు. సై, ఛ...
-
హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఈసారి తాను బాధ్యత తీసుకుంటానని పార్టీ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ యువత...
-
షిర్డీ సాయిబాబా తొలితరం భక్తులలో నానాసాహెబ్ డెంగ్లే ఒకరు. ఆయన షిర్డీకి సమీపంలోని నీంగావ్ గ్రామానికి చెందిన సంపన్న జమీందారు. బాబా దైవత్వాన్న...
No comments:
Post a Comment