న్యూఢిల్లీ: నీట్ అక్రమాలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్కు నిరసనగా కాంగ్రెస్ నేతలు మంగళవారం ప్రధాని మోదీ నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. విద్యార్థులపై లాఠీఛార్జ్కు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై చేసిన లాఠీ ఛార్జ్పై ప్రధాని మోదీ మౌనం వీడాలని, ఆయన మౌనం వీడేంత వరకు ధర్నా కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అఖిలేశ్ యాదవ్ సహా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. తర్వాత ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. దీనితో లోక్ కల్యాణ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు 3 గంటలకు పైగా ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఆ తర్వాత పోలీసులు కాంగ్రెస్ అగ్రనేతలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
హైదరాబాద్ లోనూ
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కోసం ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనకు మద్దతుగా హైదరాబాద్ లో కూడా విద్యార్థి సంఘాలు ఆందో ళనకు దిగాయి. సోమాజిగూడలోని లోక్ భవన్ ముట్టడికి విద్యార్థులు బయల్దేరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి, పలువురిని అరెస్ట్ చేశారు.
No comments:
Post a Comment